Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషే పోయాడు.. మనం కూడా తోడులేకపోతే ఎలా? సీఎం జగన్

Webdunia
బుధవారం, 10 జులై 2019 (13:47 IST)
దేశానికి అన్నం పెట్టాల్సిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్దను కోల్పోయి దిక్కులేని వారిగా మారిన కుటుంబాలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మనిషే పోయాడు.. మనం కూడా తోడులేకపోతే ఎలా అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. పైగా, ఇది మానవత్వం ఉన్న ప్రభుత్వం, ఆ దిశగానే తమ పాలన సాగుతుందన్నారు.
 
ఆయన బుధవారం కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. 
 
గత ప్రభుత్వంలో చనిపోయిన రైతులను గుర్తించని వారు ఎవరైనా ఉంటే వారిని కూడా గుర్తించి పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. చనిపోయిన రైతులకు అందించే ఆర్థిక సహాయాన్ని ఆయా జిల్లా కలెక్టర్లు నేరుగా వెళ్లి ఆయా కుటుంబాలకు అందించాలని కోరారు.
 
నిజానికి గత ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు పరిహారం ఇచ్చినట్టు లేదని, అందువల్ల అలాంటి రైతులను గుర్తించి, 2014-19 మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల సభ్యులకు ఆర్థిక పరిహారం ఇవ్వాలని కోరారు. గత ఐదేళ్ళలో డీసీఆర్‌బీ లెక్కల ప్రకారం 1513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ ఆయన గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments