Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబును మించిన దుర్మార్గుడు లేడు.. వివేకాను చంపించింది.. ఆయనే?

Jagan
Webdunia
గురువారం, 21 మార్చి 2019 (11:56 IST)
ఏపీ సీఎం చంద్రబాబుపై వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. తన అధికారానికి అడ్డువస్తే ఎవరినైనా చంపించే వ్యక్తిత్వం చంద్రబాబుదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వార్థం కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు దిగజారుతాడని జగన్ ఫైర్ అయ్యారు. 
 
బాబుకు ఓటేస్తే హత్యా రాజకీయాలకు ఓటేసినట్టేనన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపించింది చంద్రబాబేనని జగన్‌ ఆరోపించారు. ఇప్పుడు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ విమర్శించారు. తప్పు చేయకుంటే, హత్య వెనుక చంద్రబాబు పాత్ర లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 
 
చంద్రబాబు నేరగాడు కాబట్టే సీబీఐ విచారణకు జడుసుకుంటున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు నేరగాడు కాకపోతే హైదరాబాద్ నుంచి ఎందుకు పారిపోయి వస్తారని నిలదీశారు. తప్పు చేయకపోతే 19 కేసుల్లో స్టేలు ఎందుకు తెచ్చుకున్నారన్నారు. చంద్రబాబును మించిన దుర్మార్గుడు లేడని జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments