Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ లాక్ 4.0.. వాయిదా పడిన జగనన్న విద్యాకానుక..

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (21:56 IST)
కరోనా కాలం లాక్ డౌన్ కారణంగా.. పలు కార్యక్రమాలు వాయిదా పడుతూ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న 'జగనన్న విద్యాకానుక' కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. 
 
ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకు స్కూళ్లు తెరవొద్దని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జగనన్న విద్యాకానుకను కూడా స్కూళ్లు ప్రారంభించే సమయంలోనే అందించాలని నిర్ణయించింది.
 
అసలు ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 5 నుంచే ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభిస్తామని అనుకున్నామని పాఠశాల విద్య సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. అదే రోజున.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 'జగనన్న విద్యా కానుక' అందిస్తామని అనుకున్నామని చెప్పారు. 
 
అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్ - 19 అన్ లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబరు 30 దాకా పాఠశాలలు తెరవకూడదని తెలిపింది. దీంతో ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 5వ తేది నాటికి వాయిదా వేస్తున్నామని చినవీరభద్రుడు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments