Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతలకు బెదిరింపులు - భద్రత పెంపు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (14:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైకాపా నేతలకు బెదిరింపులు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఆ పార్టీ నేతలకు ప్రభుత్వం భద్రతను పెంచింది. 
 
ఇటీవల అసెంబ్లీ వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి వైకాపా మంత్రులు అసభ్యంగా మాట్లాడారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.
 
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, నేతలు ఆందోళనకు దిగి నిరసనలు తెలుపుతున్నారు. అదేసమయంలో సోషల్ మీడియా వేదికగా వారికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. 
 
ఈ క్రమంలో మంత్రి కొడాలి నానికి ప్రస్తుతం ఉన్న 2+2 గన్‌మెన్లతో పాటు అదనంగా 1+4 గన్‌మెన్ల భద్రతను ప్రభుత్వం అదనంగా కేటాయించింది. అంతేకాకుండా అదనంగా మరో భద్రతా వాహనాన్ని కూడా ప్రభుత్వం సమకూర్చింది. దీంతో 7+7 భద్రతగా ఉండనుంది.
 
అలాగే, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలకు కూడా ప్రస్తుతం ఉన్న 1+1 భద్రతకు అదనంగా 3+3 భద్రతగా పెంచింది. అంటే ఇకపై వీరికి 4+4 భద్రతగా ఉంటుంది. చంద్రబాబుపై వ్యాఖ్యలు అనంతరం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన బెదిరింపులను సమీక్షించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments