Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో 15 రోజుల్లో వివాహం.. కబళించిన రోడ్డు ప్రమాదం

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (09:56 IST)
కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. మరో 15 రోజుల్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ఓ యువజంటను రోడ్డు ప్రమాదం కబళించింది. జిల్లాలోని జగ్గంపేట మండలం, జె.కొత్తూరుకు చెందిన మానేపల్లి రాజకుమార్ (25) అనే యువకుడికి కిర్లంపూడి మండలం సోమవారానికి చెందిన మలిరెడ్డి దుర్గాభవాని (18)కి వచ్చే నెల పదో తేదీన వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. వీరికి ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. 
 
మంగళవారం వారిద్దరూ కలిసి తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం మేరీమాత ఆలయానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో వెనుక నుంచి వచ్చిన ఓ లారీ వారిని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments