కూలర్లు - ఏసీలు వాడితే విద్యుత్ బిల్లు పెరగదా? వైకాపా ఎమ్మెల్యే శిల్పా వ్యంగ్యాస్త్రాలు

Webdunia
ఆదివారం, 16 జులై 2023 (09:29 IST)
ఏసీలు, కూలర్లు వాడితే విద్యుత్ బిల్లు పెరగదా అంటూ వైకాపా ఎమ్మెల్యే మహిళలపై రుసరుసలాడారు. ఈ వ్యాఖ్యలు నంద్యాల జిల్లా శ్రీసైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేశారు. గతంలో విద్యుత్ బిల్లు రూ.200లోపు వచ్చేదని, ఇపుడు ప్రతి నెల రూ.600 నుంచి రూ.800 మేరకు వస్తుందంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన పై విధంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
శనివారం బండిఆత్మకూరు మండలం ఈర్నపాడులో జగనన్న సురక్ష కార్యక్రమానికి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి హాజరయ్యారు. ఇందులో ఆయన ప్రసంగిస్తుండగా, ఓ మహిళ లేచి విద్యుత్తు బిల్లులు ప్రతినెలా పెరుగుతున్నాయని వాపోయారు. దీనికి ఎమ్మెల్యే వ్యంగ్యంగా మాట్లాడుతూ 'సీఎం జగన్‌ ఇచ్చే సంక్షేమ పథకాలతో ఏసీలు, కూలర్లు కొంటున్నారు. వాటివల్లే ప్రతినెలా బిల్లులు అధికంగా వస్తున్నాయి' అన్నారు. 
 
అలాంటి వస్తువులేవీ మా ఇంట్లో లేవని, అయినా బిల్లులు అధికంగా వస్తున్నాయని ఆ మహిళ వాపోయారు. పలువురు గ్రామస్థులు తమ సమస్యలు తెలిపేందుకు ప్రయత్నించగా, ఎమ్మెల్యే వారిని వారిస్తూ, చిరాకు ప్రదర్శించారు. జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వాడితే విద్యుత్తు బిల్లులు పెరగవా అంటూ మరోమారు ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments