Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూలర్లు - ఏసీలు వాడితే విద్యుత్ బిల్లు పెరగదా? వైకాపా ఎమ్మెల్యే శిల్పా వ్యంగ్యాస్త్రాలు

Webdunia
ఆదివారం, 16 జులై 2023 (09:29 IST)
ఏసీలు, కూలర్లు వాడితే విద్యుత్ బిల్లు పెరగదా అంటూ వైకాపా ఎమ్మెల్యే మహిళలపై రుసరుసలాడారు. ఈ వ్యాఖ్యలు నంద్యాల జిల్లా శ్రీసైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేశారు. గతంలో విద్యుత్ బిల్లు రూ.200లోపు వచ్చేదని, ఇపుడు ప్రతి నెల రూ.600 నుంచి రూ.800 మేరకు వస్తుందంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన పై విధంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
శనివారం బండిఆత్మకూరు మండలం ఈర్నపాడులో జగనన్న సురక్ష కార్యక్రమానికి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి హాజరయ్యారు. ఇందులో ఆయన ప్రసంగిస్తుండగా, ఓ మహిళ లేచి విద్యుత్తు బిల్లులు ప్రతినెలా పెరుగుతున్నాయని వాపోయారు. దీనికి ఎమ్మెల్యే వ్యంగ్యంగా మాట్లాడుతూ 'సీఎం జగన్‌ ఇచ్చే సంక్షేమ పథకాలతో ఏసీలు, కూలర్లు కొంటున్నారు. వాటివల్లే ప్రతినెలా బిల్లులు అధికంగా వస్తున్నాయి' అన్నారు. 
 
అలాంటి వస్తువులేవీ మా ఇంట్లో లేవని, అయినా బిల్లులు అధికంగా వస్తున్నాయని ఆ మహిళ వాపోయారు. పలువురు గ్రామస్థులు తమ సమస్యలు తెలిపేందుకు ప్రయత్నించగా, ఎమ్మెల్యే వారిని వారిస్తూ, చిరాకు ప్రదర్శించారు. జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వాడితే విద్యుత్తు బిల్లులు పెరగవా అంటూ మరోమారు ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments