Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌కు చార్జ్ మెమో : రేపు తిరుపతికి పవన్

Webdunia
ఆదివారం, 16 జులై 2023 (09:09 IST)
శ్రీకాళహస్తి పట్టణ సీఐ అంజు యాదవ్ చిక్కుల్లో పడ్డారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న జనసేన పార్టీ నేత సాయిపై ఆమె అకారణంగా చేయి చేసుకున్నారు. రెండు చెంపలపై కొట్టారు. ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ పార్టీ నేతపై దెబ్బ పడితే తనపై పడినట్టేనని ప్రకటించారు. 
 
అందుకే తమ పార్టీ నేత పట్ల దురుసుగా ప్రవర్తించిన అంజు యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై వినతి పత్రం సమర్పించేందుకు ఆయన సోమవారం తిరుపతికి వస్తున్నారు. జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పించనున్నారు. ఇదిలావుంటే, సీఐ అందు యాదవ్‌కు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చార్జ్ మెమో జారీచేసినట్టు తెలుస్తుంది. అయితే, దీనిపై స్పష్టత రావాల్సివుంది. 
 
ఇంకోవైపు, అంజు యాదవ్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను సుమోటాగా స్వీకరించిన హెచ్.ఆర్.సి.. అంజు యాదవ్‌కు నోటీసులు జారీచేసింది. ఆమెతో పాటు స్టేషన్ ఆఫీసర్, తిరుపతి డీఎస్పీ, తిరుపతి ఎస్పీ, అనంతపురం డీఐజీ, తిరుపతి కలెక్టర్, డీఐజీ, హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలకు ఈ నోటీసులు జారీచేసింది. పైగా ఈ ఘటనపై విచారణ జరిపి ఈ నెల 27వ తేదీలోపు నివేదిక సమర్పించాలని అందులో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments