Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేలకిచ్చే ప్రాధాన్యత మాకేదీ?... జగన్ పై వైసీపీ ఎంపీల ఆగ్రహం!

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (07:48 IST)
ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ భేటీలో వైసీపీకి చెందిన ఎంపీలంతా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

సీఎం జగన్ ఎమ్మెల్యేకు ఇచ్చినంత ప్రాధాన్యత తమకు ఇవ్వడంలేదని ఎంపీలు కినుక వహించినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీలు తమ అసహనాన్ని దాచుకోవడంలేదు. పార్టీ గీత దాటితే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని జగన్ హెచ్చరికలు చేసి మరీ పంపినప్పటికీ వైసీపీ ఎంపీలు ఎవరూ లెక్కచేయలేదు.

తెలుగు మీడియం కోసం రఘురామకృష్ణం రాజు పార్లమెంట్‌లోనే ప్రశ్నలు సంధించారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసుకునేందుకు విజయసాయి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఎంపీలు తమ అసంతృప్తిని పూర్తి స్థాయిలో బయట పెట్టారు. ఈ సమావేశానికి పలువురు ఎంపీలు డుమ్మా కొట్టారు.

మిగిలినవారిలో అనేకమంది తమ తమ నియోజక వర్గాల్లో తమకు ఎదురవుతున్న పరిస్థితులను ఏకరవుపెట్టారు.
తమ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై సమావేశంలో వైసీపీ ఎంపీల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తీసుకోవాల్సి వస్తోందని, ఎమ్మెల్యేలకు ఇచ్చినంత ప్రొటోకాల్‌ తమకు ఇవ్వడం లేదని ఎంపీలు అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల తీరును జగన్‌ దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలు విజయసాయిని కోరారు.

నామినేటెడ్‌ పదవుల్లోనూ ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీలు డిమాండ్ చేశారు. జగన్‌ పాలనపై జాతీయస్థాయిలో వ్యతిరేకత వస్తోందని.. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డికి తెలిపారు. జగన్‌ ప్రభుత్వ విధానాలను జాతీయస్థాయిలో ప్రచారం చేసేందుకు.. ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని విజయసాయిరెడ్డి సూచించారు. 

పార్లమెంట్‌లో జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలు మాట్లాడితే.. అడ్డుకోవాలని వైసీపీ ఎంపీలకు విజయసాయి సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments