Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు సభలో వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్... జంప్ జిలానీయేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం "జన్మభూమి - మా ఊరు" కార్యక్రమం ప్రారంభమైంది. ఈకార్యక్రమం రెండో రోజైన బుధవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా పులివెందులలో జరిగిన జన్మభూమి కార్యక్రమ

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (16:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం "జన్మభూమి - మా ఊరు" కార్యక్రమం ప్రారంభమైంది. ఈకార్యక్రమం రెండో రోజైన బుధవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా పులివెందులలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఎవరూ ఊహించని దృశ్యం ఒకటి ఆవిష్కృతమైంది.
 
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైకాపాకు చెందిన కడప ఎంపీ, పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డికి దగ్గరి బంధువు అయిన వైఎస్ అవినాష్ రెడ్డి పాలుపంచుకోవడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఇటీవలి కాలంలో పలువురు వైకాపా ఎమ్మెల్యేలు జగన్‌కు టాటా చెప్పి అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతున్న విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో వైఎస్ ఫ్యామిలీకే చెందిన వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందులలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన జన్మభూమి సభలో పాల్గొనడంతో అందరి దృష్టి ఆయనపై కేంద్రీకృతమైంది. 
 
కాగా, ఈ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం పులివెందులకు నీరు ఇచ్చామన్నారు. రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌గా మారుతుందన్నారు. రాయలసీమలో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్థికలోటు ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments