Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతిబీరలో నెయ్యి ఎంత ఉంటుందో.. వైకాపా సామాజిక న్యాయం అంతేవుంది : వైకాపా ఎమ్మెల్సీ

ఠాగూర్
సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (15:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తుంది. అధికార పార్టీలో రెబెల్ ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించారు. తమ వైకాపాలో సామాజిక న్యాయం అనేది లేదన్నారు. నేతిబీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వైకాపాలో సామాజిక న్యాయం కూడా అంతేనని ఆయన వ్యాఖ్యానించారు. 
 
పార్టీలోని బీసీ నేతలకు ఎక్కడా న్యాయం జరగడం లేదన్నారు. గౌరవ మర్యాదలు మచ్చుకైనా కనిపించవన్నారు. ప్రోటోకాల్‌కు అనే మాటకే తావు లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలు తమ సంక్షేమం కోసం కాకుండా ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీసీలు పార్టీకి దూరమవుతున్నారని, దీనిపై వైకాపా పెద్దలు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 
ముఖ్యంగా గత నాలుగున్నరేళ్ళ కాలంలో బీసీలకు పదవులు ఇచ్చారు. కానీ, అధికారం ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. కీలక పదవులన్నీ ఒక సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయని, బీసీలకు నామమాత్రంగా కూడా అధికారాలు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీగానే కాకుండా, వైకాపా బీసీ విభాగం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇపుడు ఈయన పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments