నేతిబీరలో నెయ్యి ఎంత ఉంటుందో.. వైకాపా సామాజిక న్యాయం అంతేవుంది : వైకాపా ఎమ్మెల్సీ

ఠాగూర్
సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (15:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తుంది. అధికార పార్టీలో రెబెల్ ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించారు. తమ వైకాపాలో సామాజిక న్యాయం అనేది లేదన్నారు. నేతిబీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వైకాపాలో సామాజిక న్యాయం కూడా అంతేనని ఆయన వ్యాఖ్యానించారు. 
 
పార్టీలోని బీసీ నేతలకు ఎక్కడా న్యాయం జరగడం లేదన్నారు. గౌరవ మర్యాదలు మచ్చుకైనా కనిపించవన్నారు. ప్రోటోకాల్‌కు అనే మాటకే తావు లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలు తమ సంక్షేమం కోసం కాకుండా ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీసీలు పార్టీకి దూరమవుతున్నారని, దీనిపై వైకాపా పెద్దలు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 
ముఖ్యంగా గత నాలుగున్నరేళ్ళ కాలంలో బీసీలకు పదవులు ఇచ్చారు. కానీ, అధికారం ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. కీలక పదవులన్నీ ఒక సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయని, బీసీలకు నామమాత్రంగా కూడా అధికారాలు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీగానే కాకుండా, వైకాపా బీసీ విభాగం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇపుడు ఈయన పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments