Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ ఎమ్మెల్యే ఆస్తులు వేలం వేయనున్న కెనరా బ్యాంకు.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (10:19 IST)
YCP MLA Sridhar Reddy
రుణాల ఎగవేత వ్యవహారంలో శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గ శాసన సభ్యుడు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి సంబంధించిన ఆస్తులను కెనరా బ్యాంకు వేలం వేయనుంది. 
 
ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆ బ్యాంకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. మెసర్స్‌ సాయిసుధీర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ కంపెనీ కెనరా బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంది. వాటిని సకాలంలో చెల్లించలేదు.
 
అయితే ఆ కంపెనీకి శాసన సభ్యుడు శ్రీధర్ రెడ్డి హామీదారుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కంపెనీతో పాటు హామీదారైన శ్రీధర్ రెడ్డి ఆస్తులను ఆగస్టు 18వ తేదీన వేలం వేస్తున్నట్టు ఆ బ్యాంకు ప్రకటించింది. 
 
కాగా ఆ కంపెనీ తీసుకున్న లోన్ ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన నాటికి అసలు, వడ్డీ కలిపి రూ.908 కోట్లు అయ్యాయి. వాటిని చెల్లించకపోవడంతో ఆ కంపెనీ, అలాగే హామీదారు ఆస్తులను వేలం వేయాల్సి వస్తోందని కెనరా బ్యాంకు తన ప్రకటనలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments