శ్రీకాకుళంలో చేపల వర్షం.. ఆకాశం నుంచి రాలిన చేపలు.. (video)

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (09:51 IST)
Fish Rain
ఏపీ శ్రీకాకుళం జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో గురువారం వజ్రపు కొత్తూరు మండలం వజ్రపు కోనేరు, భూబాల పల్లి, కాళేశ్వరి నగర్, సుల్తానాబాద్ శాస్త్రి నగర్, మహదేవపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ఆకాశం నుంచి చేపలు పడ్డాయి. దీంతో చేపలు రోడ్లన్నీ పాకాయి. ఆకాశం నుంచి చేపల వర్షం కురవడంతో ఆ ప్రాంత జనం ఆశ్చర్యపోయారు. 
 
దీన్ని గమనించిన మహిళలు రోడ్డుపై పడిన చేపలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసి తమ ఇళ్లకు తీసుకెళ్లారు. అదేవిధంగా వజ్రపు కోనేరు గ్రామంలోని ఆంజనేయ ఆలయ సముదాయంలో పెద్దఎత్తున చేపలు పడ్డాయి. నేలపై పడిన చేపలను సేకరించేందుకు గ్రామస్తులు, భక్తులు పరుగులు తీశారు.
 
శ్రీకాకుళం జిల్లాలో తొలిసారి వర్షంతో ఆకాశం నుంచి చేపలు రాలినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆకాశం నుంచి పడిన చేపలు నలుపు రంగులో చూడ్డానికి భయంకరంగా ఉన్నాయని తెలిపారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు సెల్‌ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments