Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళంలో చేపల వర్షం.. ఆకాశం నుంచి రాలిన చేపలు.. (video)

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (09:51 IST)
Fish Rain
ఏపీ శ్రీకాకుళం జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో గురువారం వజ్రపు కొత్తూరు మండలం వజ్రపు కోనేరు, భూబాల పల్లి, కాళేశ్వరి నగర్, సుల్తానాబాద్ శాస్త్రి నగర్, మహదేవపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ఆకాశం నుంచి చేపలు పడ్డాయి. దీంతో చేపలు రోడ్లన్నీ పాకాయి. ఆకాశం నుంచి చేపల వర్షం కురవడంతో ఆ ప్రాంత జనం ఆశ్చర్యపోయారు. 
 
దీన్ని గమనించిన మహిళలు రోడ్డుపై పడిన చేపలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసి తమ ఇళ్లకు తీసుకెళ్లారు. అదేవిధంగా వజ్రపు కోనేరు గ్రామంలోని ఆంజనేయ ఆలయ సముదాయంలో పెద్దఎత్తున చేపలు పడ్డాయి. నేలపై పడిన చేపలను సేకరించేందుకు గ్రామస్తులు, భక్తులు పరుగులు తీశారు.
 
శ్రీకాకుళం జిల్లాలో తొలిసారి వర్షంతో ఆకాశం నుంచి చేపలు రాలినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆకాశం నుంచి పడిన చేపలు నలుపు రంగులో చూడ్డానికి భయంకరంగా ఉన్నాయని తెలిపారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు సెల్‌ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments