Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను టీడీపీ నేతలు వివస్త్ర చేస్తే.. బాబు నోరెత్తలేదు: రోజా

విశాఖపట్నం పెందుర్తిలో ఓ మహిళను టీడీపీ నేతలు వివస్త్రను చేసిన కొట్టారని.. అయినా ఏపీలోని చంద్రబాబు సర్కారు ఏమాత్రం నోరెత్తలేదని వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. 2017 నారావారి నరకాసుర సంవత్సర

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (17:07 IST)
విశాఖపట్నం పెందుర్తిలో ఓ మహిళను టీడీపీ నేతలు వివస్త్రను చేసిన కొట్టారని.. అయినా ఏపీలోని చంద్రబాబు సర్కారు ఏమాత్రం నోరెత్తలేదని వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. 2017 నారావారి నరకాసుర సంవత్సరమని రోజా ధ్వజమెత్తారు.

చంద్రబాబు సర్కారు, అరాచకాలు, ఆత్మహత్యలు, అత్యాచారం వంటి అబద్ధాలతో ఏపీ సాగుతోందని ఆరోపించారు. 
 
చంద్రబాబు పాలనలో క్యాలెండర్లు మారేయే కానీ.. తలరాతలు మాత్రం మారలేదని చెప్పుకొచ్చారు. కొత్త సంవత్సరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు వద్దంటూ ఆదేశించిన ప్రభుత్వం... 31వ తేదీన అర్థరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలను ఎందుకు అనుమతించిందని రోజా మండిపడ్డారు. 
 
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పథకాల్లో చంద్రబాబు ఒక్క శాతం కూడా చేయలేదని రోజా విమర్శలు గుప్పించారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మహిళల కోసం ఎన్నో మంచి పనులు చేశారని... సబితకు హోంమంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఐదుగురు మహిళలను మంత్రులు చేశారని రోజా చెప్పారు. ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి పథకాలతో మహిళలకు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments