Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు ధైర్యముంటే జగన్‌తో పాటు నడవాలి: రోజా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు హలూసినేషన్ సిక్స్ స్టేజ్‌లో వున్నారని.. ఆ స్టేజ్‌లో చేయనివన్నీ చేసినట్టుగా అలా అనిపిస్తుందని.. చంద్రబాబుక

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2017 (13:38 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు హలూసినేషన్ సిక్స్ స్టేజ్‌లో వున్నారని.. ఆ స్టేజ్‌లో చేయనివన్నీ చేసినట్టుగా అలా అనిపిస్తుందని.. చంద్రబాబుకు ప్రస్తుతం అదే జబ్బు పట్టుకుందని నిప్పులు చెరిగారు. ఆ జబ్బు ప్రభావంతోనే రాష్ట్రంలో ఏ సమస్యా లేదని చంద్రబాబు చెప్తున్నారని, రుణమాఫీ చేశానని, నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చానని చెప్పుకుంటున్నారన్నారు. 
 
రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకోవాలన్న ఆకాంక్షతో జగన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని.. ఈ యాత్రను చూసి తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని రోజా విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ధైర్యముంటే జగన్‌తో పాటు నడిచి, ఏ గ్రామంలో ఏ అభివృద్ధి జరిగిందో చూపించాలని రోజా సవాల్ విసిరారు. 
 
ఎక్కడైనా రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా ఉన్నాయా? అని ఆమె ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం వచ్చిందా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. దోచుకున్నది దాచుకోవడమే తప్ప చంద్రబాబు మరేమైనా చేశారా? అంటూ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments