Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి లడ్డూ వివాదం.. నెయ్యి కల్తీ కాలేదు.. ఆవు కల్తీ అయింది.. : వైకాపా నేత తమ్మినేని సీతారాం

ఠాగూర్
గురువారం, 26 సెప్టెంబరు 2024 (09:35 IST)
పరమపవిత్రమైన శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని ఉపయోగించి చేసిన వ్యవహారం ఇపుడు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. గత పాలకులు ఉద్దేశపూర్వకంగానే శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించినట్టు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో వైకాపా సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ కాలేదని, ఆవు కల్తీ అయిందంటూ సరికొత్త భాష్యం చెప్పారు. 
 
లడ్డూ వివాదంపై ఆయన శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ, 'పోషకాహార లోపంతో ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి.. ఆవాలు, అవిశలు, పామాయిల్ వంటి వ్యర్థాలను ఆహారంగా తీసుకొనే ఆవుల పాల నుంచి తయారు చేసే నెయ్యి కావొచ్చు. కూటమి నేతలు ఆరోపిస్తున్నట్లుగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటివి లోపలికి అనుమతించింది మీరే అవుతారు. మాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? పరీక్షలో ఖచ్చితత్వం లోపించే అవకాశం లేకపోలేదని ఎస్‌బీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఉన్న లోపాలేంటి, జరిగిందేంటి అనేది తెలుసుకోవాలి. ఎంతో భద్రతగా చేయాల్సిన పనిని అల్లరి చేస్తే మన దేవుడి విలువను మనమే తగ్గించుకోవడం అవుతుంది. చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో హిందువుల మనోభావాలు దెబ్బతినే దుస్థితి వచ్చింది' అని తమ్మినేని సీతారాం విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments