Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులపై మడమ తిప్పిన వైకాపా... అది అప్పటి విధానమట : బొత్స

ఠాగూర్
సోమవారం, 3 మార్చి 2025 (19:37 IST)
అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు నవ్యాంధ్రకు మూడు రాజధానులను నిర్మిస్తామంటూ ఢంకా బజాయించిన వైకాపా నేతలు వెనక్కి తగ్గారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మూడు రాజధానులకు కట్టుబడివున్నాంటూ పదేపదే ప్రకటనలు గుప్పించారు. కానీ ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో పాటు మూడు రాజధానుల అంశాన్ని రాష్ట్ర ప్రజలు తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో 151 నుంచి 11 సీట్లకు పడిపోయారు. దీంతో ఆ పార్టీ నేతలు పునరాలోచనలో పడ్డారు. మూడు రాజధానులే తమ పార్టీ విధానమని ఇప్పటివరకు గట్టిగా చెప్పిన వైకాపా నేతలు ఇపుడు వెనక్కి తగ్గారు. రాజధానిపై తమ విధానాన్ని పునరాలోచన చేస్తామని ఏపీ శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. 
 
అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి తాము మూడు రాజధానుల వైపు వెళ్లామని బొత్స అన్నారు. రాజధానిపై ఇపుడు తమ విధానం ఏమిటనేది చర్చించి చెబుతామని స్పష్టం చేశారు. ఈ అంశంపై పార్టీలో సమగ్రంగా చర్చించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు. అమరావతి శ్మశానంలా ఉందంటూ గతంలో తాను వ్యాఖ్యానించడం నిజమేనని అంగీకరించిన బొత్స.. ఆరేళ్ళ క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి అలా మాట్లాడాల్సివచ్చిందని వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments