Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి ప్రభుత్వం దేహి అనే దౌర్యాగ్య స్థితికి వచ్చింది: భాజపా ఎమ్మెల్సీ మాధవ్

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (22:23 IST)
రాష్ట్రప్రభుత్వం మొదటిసారి ఆర్థిక పరిస్థితి బాగోలేదని సిఎం జగన్ కేంద్రాన్ని అడిగారన్నారు బిజెపి రాష్ట్ర కార్యదర్సి, ఎమ్మెల్సీ మాధవ్. పింఛను, జీతాలు ఇవ్వలేని స్థితిలో వైసిపి ప్రభుత్వం దేహి అనే దౌర్యాగ్య స్థితికి వచ్చిందన్నారు. 

 
ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడే విధంగా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను నమ్మించి వైసిపి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు బిజెపి అండగా నిలుస్తుందన్నారు. 

 
గ్రామ సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ప్రభుత్వం అందించాలన్నారు. విధివిధానాలు లేక గ్రామ సచివాలయ ఉద్యోగులు తల్లడిల్లిపోతున్నారన్నారు. సినిమా ధరలు తగ్గించి ఎవరినో ఇబ్బందులు గురిచేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. 

 
నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజల్ ధరలను విపరీతంగా ప్రభుత్వం పెంచేసిందన్నారు. పండుగలు వస్తే విపరీతంగా యాభై శాతం వరకు ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదలపై అధిక భారం మోపుతోందన్నారు. ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలన్నారు.

 
పంజాబ్ లో ప్రధానిని అడ్డుకోవడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ దిక్కులేని పార్టీగా దేశంలో ఉందన్నారు. చంద్రబాబుకు ప్రజల్లో ఆదరణ కరువైందని విమర్సించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments