Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడవాళ్లకు అక్కా కాని.. మగవాళ్లకు బావా కాని వ్యక్తి నారా లోకేశ్ : గోరంట్ల మాధవ్

ఠాగూర్
శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (16:15 IST)
ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కించపరిచేలా వ్యాఖ్యానించిన వైకాపా మాజీ మంత్రి గోరంట్ల మాధవ్‌పై ఏపీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్... ఆడవాళ్లకు అక్కా కాని, మగవాళ్లకు బావా కాని వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తి జడ్ కేటగిరీ భద్రతను కల్పించి, సీఆర్పీఎఫ్ బలగాలను కేటాయించారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 
 
లోకేశ్‌‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ తాడేపల్లికి చెందిన టీడీపీ నేత జి.నాగేశ్వర రావు తాడేపల్లి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన మాధవ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 
 
ఇదిలావుంటే ఒక్క రోజు వ్యవధిలోనే వైకాపాకు చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై రెండు కేసులు నమోదు కావడం గమనార్హం. జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళుతుండగా పోలీసులు వాహనాలను వెంబడించి మాధవ్ రచ్చ చేశారు. 
 
పోలీసుల వాహనాలను ఆపి కిరణ్‌పై దాడి చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మాధవ్ పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయనపై మరో కేసు నమోదు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments