Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాలనలో రెడ్లు బాగా నష్టపోయాం.. కానీ : కేతిరెడ్డి (Video)

ఠాగూర్
సోమవారం, 25 నవంబరు 2024 (09:53 IST)
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వైకాపా ప్రభుత్వ పాలనలో రెడ్డి సామాజిక వర్గం ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. అయితే, ఆయన పాలనలో రెడ్లు తలెత్తుకుని నిలబడేలా చేశారని, ఇది ప్రతి ఒక్క రెడ్డికి గర్వకారణమన్నారు. 
 
అనంతపురం ధర్మవరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నష్టపోయిన మాట నిజమేనన్నారు. ఆర్థికంగా చాలా నష్టం జరిగిందన్నారు. కానీ, ప్రతి ఒక్క రెడ్డి తలెత్తుకుని తిరిగేలా జగన్ చేశారన్నారు. 
 
అలాగే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం ఎంతో గొప్పదన్నారు. ఈ పథకాల వల్ల కోట్లాది పేద, మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందారన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా తాను నిర్వహించిన గుడ్ మార్నింగ్ దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రతి రోజూ ఉదయం కనీసం 10 నుంచి 20 మంది వరకు తన వద్దకు వచ్చి తమ సమస్యలు చెప్పుకునేవారని, ఆ సమస్యలకు పరిష్కారం చూపించడంలో ఒక ఎమ్మెల్యేగా తనకు ఎంతో సంతృప్తి మిగిలిందన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments