Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదాద్రిలో వ్యభిచార కూపం.. అమ్మాయిలను కిడ్నాప్ చేసి?

యాదాద్రి పోలీస్‌ స్టేషన్‌ వద్ద తల్లిదండ్రుల రోదన వినిపించింది. అక్కడ వ్యభిచార నిర్వాహకుల చెర నుంచి బయటపడిన 15 మంది బాలికల్లో తమ కూతురు ఉంటుందేమోనని కొందరు తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. ఫొటోలను చూసి

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (15:08 IST)
యాదాద్రి పోలీస్‌ స్టేషన్‌ వద్ద తల్లిదండ్రుల రోదన వినిపించింది. అక్కడ వ్యభిచార నిర్వాహకుల చెర నుంచి బయటపడిన 15మంది బాలికల్లో తమ కూతురు ఉంటుందేమోనని కొందరు తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. ఫొటోలను చూసి ఇద్దరు బాలికలను గుర్తించిన తల్లిదండ్రుల ఆవేదన చెందారు.


తమ బిడ్డలు ఇన్నాళ్లు వ్యభిచార కూపంలో మగ్గారని తెలుసుకొని గుండెలవిసేలా రోదించారు. తమ బిడ్డలను చూపెట్టాలంటూ పోలీసులను ప్రాధేయపడ్డారు. ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత పిల్లలను అప్పగిస్తామని పోలీసులు వారికి చెప్పారు. 
 
వ్యభిచార గృహాల నిర్వాహకుల నుంచి 15మంది బాలికలకు విముక్తి కల్పించిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. యాదాద్రి పట్టణంలోని కల్యాణి అనే మహిళ ఇంట ఈ దందా జరుగుతోంది.

ఆ ఇంట ఆడ పిల్లల ఏడుపు విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ ఇంట సోదాలు నిర్వహించి.. కల్యాణిని గట్టిగా నిలదీసేసరికి నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఇలా కల్యాణి చెర నుంచి పోలీసులు 15మంది బాలికలను రక్షించారు. ఈ కేసులో ఇప్పటివరకు 11మంది నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, మరో ముగ్గురు నిర్వాహకులు పరారీలో ఉన్నారు. మరోవైపు హార్మోన్ల వృద్ధి కోసం బాలికలకు ఇంజెక్షన్లు చేస్తున్నట్టుగా తేలడంతో యాదాద్రిలోని అనురాధ నర్సింగ్‌ హోంను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సాంబశివరావు సీజ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments