Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాపై అత్యాచారం జరిగింది.. ఇదిగోండి.. పిండం.. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా?

ఉత్తరప్రదేశ్‌లో ఓ అత్యాచార బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు తన ఐదు నెలల పిండాన్ని ఓ బ్యాగులో వేసుకొచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాను అత్యాచారానికి గురైయ్యానని.. నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవ

నాపై అత్యాచారం జరిగింది.. ఇదిగోండి.. పిండం.. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా?
, సోమవారం, 23 జులై 2018 (14:22 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఓ అత్యాచార బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు తన ఐదు నెలల పిండాన్ని ఓ బ్యాగులో వేసుకొచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాను అత్యాచారానికి గురైయ్యానని.. నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. గర్భస్రావం కావడంతో ఆ పిండాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే... యూపీ, అమ్రోహా జిల్లాకు చెందిన 19ఏళ్ల యువతిని మనోజ్ (22) అనే యువకుడు ఐదు నెలల క్రితం బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సాకుతో మళ్లీ మళ్లీ ఆ యువతిని లొంగదీసుకుని బెదిరించాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది. అయితే ఆమె కుటుంబీకులు యువతికి గర్భస్రావం చేయించారు. 
 
దీంతో ఆగ్రహానికి గురైన యువతి పోలీస్ స్టేషన్‌కు పిండంతో సహా వచ్చింది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని.. పిండమే ఇందుకు సాక్ష్యమని బ్యాగును చూపెట్టింది. దీంతో ఖంగుతిన్న పోలీసులు.. మనోజ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో వున్న మనోజ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌ పెళ్లి వేడుకలో బెల్లీ డ్యాన్స్.. బంగారాన్ని పేస్టులా?