Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగ్ కాల్ అంత పనిచేసింది.. యువతిపై అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (11:45 IST)
రాంగ్ కాల్ ఓ యువతిపై అత్యాచారానికి కారణమైంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దండేపల్లిలో గ్రామానికి చెందిన యువతి కనిపించడం లేదంటూ గత నెల 27న పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల విచారణలో రాంగ్‌కాల్ విషయం బయటపడింది.

సాయికృష్ణ అనే యువకుడి నుంచి రాంగ్ ఫోన్ కాల్ వచ్చిందని.. ఆ తర్వాత సాయికృష్ణ ఆ యువతికి పదేపదే ఫోన్ చేసి విసిగించేవాడని తేలింది. దీంతో ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు అతడిని మందలించారు. 
 
గత నెల 25న యువతికి మరోమారు ఫోన్ చేసిన యువకుడు మాట్లాడాలి రమ్మంటూ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్దకు పిలిచాడు. అతడిని గట్టిగా మందలించేందుకు ఇదే సమయమని భావించిన యువతి అక్కడికి వెళ్లింది.

తన మిత్రుడు శివకృష్ణతో కలిసి అప్పటికే అక్కడికి ఆటోలో చేరుకున్న సాయికృష్ణ యువతి రాగానే బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని రామకృష్ణాపూర్‌‌లోని పాడుబడిన పాఠశాల భవనంలోకి తీసుకెళ్లాడు. 
 
ఆ భవనంలో ఆమెపై అత్యాచారం జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ అఘాయిత్యం జరిగింది. అక్కడ నుంచి తప్పించుకున్న యువతి బంధువులకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. నిన్న నిందితులందరూ కలిసి ఆటోలో కరీంనగర్ వైపు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు. నిందితుల్లో ఒకడైన బాలుడిని హైదరాబాద్‌లోని జువైనల్ హోంకు తరలించారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments