Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఎస్ఐ భవానీ ఆత్మహత్య : ఫస్ట్ పోస్టింగ్ వచ్చిన చోటే బలవన్మరణం...

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (12:13 IST)
విజయనగరం జిల్లాలో విషాదకర ఘటన ఒకటి జరిగింది. అడిషినల్ ఎస్ఐగా ఉన్న కె.భవానీ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెకు తొలిసారి పోస్టింగ్ వచ్చిన చోటే బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామానికి చెందిన కె.భవానీ సఖినేటిపల్లి మహిళా అడిషనల్ ఎస్.ఐగా పని చేస్తున్నారు. 2018 బ్యాచ్‌కి చెందిన ఎస్సై భవానీకి ఇంకా పెళ్లి కాలేదు. 
 
అయితే, వారం రోజుల క్రితం విజయనగరం జిల్లాలో పీటీసీ ట్రైనింగ్ నిమిత్తం వెళ్లి వచ్చారు. విశాఖపట్నంలో ఉన్న సోదరుడు శివకు చివరిసారి ఫోన్‌ చేసి శిక్షణ పూర్తయిపోయినట్లు చెప్పిందని తెలిసింది. ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది.. 
 
రాజోలు స్టేషన్‌లో ట్రైనింగ్ అనంతరం సఖినేటిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో భవానీకి మొదటి పోస్టింగ్ వచ్చింది.. అక్కడే ఆమె ప్రాణాలు తీసుకున్నారు. ఎస్సై ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
 
మరోవైపు, భవానీ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని విజయనగరం డీఎస్పీ పి.అనిల్‌కుమార్‌ తెలిపారు. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments