Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఎస్ఐ భవానీ ఆత్మహత్య : ఫస్ట్ పోస్టింగ్ వచ్చిన చోటే బలవన్మరణం...

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (12:13 IST)
విజయనగరం జిల్లాలో విషాదకర ఘటన ఒకటి జరిగింది. అడిషినల్ ఎస్ఐగా ఉన్న కె.భవానీ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెకు తొలిసారి పోస్టింగ్ వచ్చిన చోటే బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామానికి చెందిన కె.భవానీ సఖినేటిపల్లి మహిళా అడిషనల్ ఎస్.ఐగా పని చేస్తున్నారు. 2018 బ్యాచ్‌కి చెందిన ఎస్సై భవానీకి ఇంకా పెళ్లి కాలేదు. 
 
అయితే, వారం రోజుల క్రితం విజయనగరం జిల్లాలో పీటీసీ ట్రైనింగ్ నిమిత్తం వెళ్లి వచ్చారు. విశాఖపట్నంలో ఉన్న సోదరుడు శివకు చివరిసారి ఫోన్‌ చేసి శిక్షణ పూర్తయిపోయినట్లు చెప్పిందని తెలిసింది. ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది.. 
 
రాజోలు స్టేషన్‌లో ట్రైనింగ్ అనంతరం సఖినేటిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో భవానీకి మొదటి పోస్టింగ్ వచ్చింది.. అక్కడే ఆమె ప్రాణాలు తీసుకున్నారు. ఎస్సై ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
 
మరోవైపు, భవానీ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని విజయనగరం డీఎస్పీ పి.అనిల్‌కుమార్‌ తెలిపారు. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments