Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఆ ఫోటోలతో బెదిరింపులు

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (12:19 IST)
విశాఖలో మహిళపై అత్యాచారానికి పాల్పడిన కీచకుడు ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. వాటి ద్వారా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతూ ఆ తర్వాత కూడా ఆమెపై పలుసార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా తనకు డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు దిగాడు. పలుసార్లు డబ్బులు ఇచ్చినా అతడి వేధింపులు మాత్రం ఆగలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
వివరాల్లోకి వెళితే.. విశాఖకు చెందిన ఓ మహిళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. దీంతో ఆమెను ట్రాప్ చేసిన ఓ వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ప్లాన్ ప్రకారం ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతర్వాత ఆమెను నగ్నంగా ఉన్న ఫోటోలను తీశాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. 
 
ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమెపై మరోసారి అత్యాచారం చేశాడు. డబ్బు కావాలంటూ బెదిరించాడు. పరువు పోతుందని భావించిన బాధితురాలు... అప్పులు చేసి మరీ అతగాడికి రూ.50 లక్షల వరకు డబ్బు అంటగట్టింది. ఈ దారుణానికి అతడి తల్లిదండ్రులు కూడా వంతపాడారు. చివరికి అతడి ఆగడాలను ఆపలేకపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments