Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు పక్షవాతం... బావతో పడకసుఖం... మోజు తీరాక తలపై రాయితో కొట్టి...

పక్షవాతంతో మంచానపడిన భర్త వల్ల శారీరకసుఖం లభించలేదని భావించిన ఓ వివాహిత.. వరుసకు బావయ్యే వ్యక్తితో పడక పంచుకుంది. మోజు తీరిన తర్వాత ఆమెను అతనే హత్య చేశాడు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలూ అనాథలయ్యారు. వరంగల్

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (14:48 IST)
పక్షవాతంతో మంచానపడిన భర్త వల్ల శారీరకసుఖం లభించలేదని భావించిన ఓ వివాహిత.. వరుసకు బావయ్యే వ్యక్తితో పడక పంచుకుంది. మోజు తీరిన తర్వాత ఆమెను అతనే హత్య చేశాడు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలూ అనాథలయ్యారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామ శివారులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని నెక్కొండ మండలం గుండ్రపల్లికి చెందిన పఠాని సలీమా (27) తన భర్త యాకూబ్‌తో పాటు తన ఇద్దరు కుమారులతో కలిసి కిరాణ షాపును నడుపుతూ జీవిస్తోంది. గతంలో తన భర్త నాలుగేళ్లపాటు సౌదీకి వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలోనే సంవత్సరం క్రితం యాకూబ్‌కు పక్షవాతం వచ్చి కాళ్లు చచ్చుపడిపోయాయి. దీంతో కిరాణం దుకాణానికి కావాల్సిన సామాన్లను తీసుకువచ్చేందుకు నెక్కొండకు చెందిన వరుసకు బావ అయిన చిరువ్యాపారం చేసుకుంటున్న పఠాన్‌లాలుతో కలిసి సలీమా వెళుతూ వచ్చేది. 
 
ఈ క్రమంలో పఠాన్‌లాలుతో సలీమాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ ఇద్దరు కలిసి మంగళవారం తీగరాజుపల్లి గ్రామశివారులోకి వెళ్లారు. అక్కడ మద్యం తాగిన అనంతరం తనతోపాటు ఇతరులతో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నావంటూ సలీమాను లాలు నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో లాలూ రాయితో సలీమా తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments