Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. వద్దమ్మా అన్నాడు.. అంతే కన్నకొడుకునే చంపేసింది..

వివాహేతర సంబంధాలు.. వాటి ద్వారా జరిగే నేరాలు అధికమవుతున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డు చెప్తున్నాడనే కారణంగా కన్నకొడుకునే కర్కశ తల్లి హత్య చేసింద

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (15:25 IST)
వివాహేతర సంబంధాలు.. వాటి ద్వారా జరిగే నేరాలు అధికమవుతున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డు చెప్తున్నాడనే కారణంగా కన్నకొడుకునే కర్కశ తల్లి హత్య చేసింది. 
 
ఈ ఘటన విజయనగరం జిల్లా కేంద్రంలోని గాయత్రీనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాకు చెందిన ఓ వివాహిత 17 ఏళ్ల క్రితం భర్తతో విడిపోయింది. భర్తతో విడిపోయిన తర్వాత ఆమె కొంత కాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. 
 
ఈ వ్యవహారంపై ఆమె కుమారుడు హరిభగవాన్‌ గొడవకు దిగేవాడు. దీంతో తల్లీకుమారుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో హరి భగవాన్ తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆ తల్లి భావించింది. భోజనంలో నిద్రమాత్రలను కలిపి హరిభగవాన్‌కు ఇచ్చింది. భోజనం తిన్న తర్వాత హరిభగవాన్ మత్తులోకి జారుకొన్నాడు. ఆపై చున్నీతో అతడి గొంతు బిగించి హత్య చేసింది. 
 
ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో కుమారుడిని హత్యచేసినట్లు ఒప్పేసుకుంది. అయితే హరిభగవాన్ హత్యలో ప్రియుడి ప్రమేయం కూడ ఉందా లేదా అనే కోణంలో విచారణ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments