Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై కేసు పెట్టిన మహిళ.. ఎందుకు?

సెల్వి
మంగళవారం, 25 జూన్ 2024 (21:27 IST)
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. వివరాల ప్రకారం.. భగత్‌సింగ్‌ కాలనీలోని తన భూమిని అనిల్‌కుమార్‌ యాదవ్‌ అక్రమంగా కబ్జా చేశారంటూ కౌసర్‌జాన్‌ అనే మహిళ నెల్లూరు చిన్నబజార్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. తన భూమిలో అనిల్‌కుమార్‌ యాదవ్‌ వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని ఆమె ఆరోపించారు. 
 
ఈ కేసులో తనకు న్యాయం చేయాలని ఏడాది కాలంగా దీక్ష చేస్తున్నానని కౌసర్‌జాన్‌ పేర్కొన్నారు. ఈ భూమిని తన భర్త 2002లోనే కొనుగోలు చేశాడని, వైసీపీ భవనాన్ని నిర్మించేందుకు అనిల్ అందులో 2.8 ఎకరాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని ఆమె పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments