Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకెంత మంది ముస్లింలను బలిగొంటారు?:లోకేష్

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (23:22 IST)
కొంతమంది పోలీసులు పులివెందుల ఫ్యాక్షన్ ముఠా సభ్యుల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి కోసం ఇంకెంత మంది ముస్లిం మైనారిటీలను బలిగొంటారని ప్రశ్నించారు.

సీఎం బంధువు తిరుపాల్ రెడ్డి.. అక్బర్ బాషా భూమి కబ్జా చేస్తే.. బాషాని సీఐ ఎన్ కౌంటర్ చేస్తామనడం... కుటుంబమంతా సామూహిక ఆత్మహత్యాయత్నం చేస్తే కిడ్నాప్ చేయడం.. పోలీసుల విధులా? అని నిలదీశారు. అక్బర్ బాషా భూమి తిరిగిచ్చేశామని, వివాదం సమసిపోయిందని నమ్మించిన జగన్ రెడ్డి బృందం.. ‘దిక్కున్నచోట చెప్పుకో.. నీ భూమి ఇచ్చేది లేదని తేల్చేయడంతో బాషా కుటుంబంతో సహా మళ్లీ ఆత్మహత్య ప్రయత్నం చేసిందని’ అన్నారు.

అక్బర్ కుటుంబంలో ఏ ఒక్కరి ప్రాణాలకి ప్రమాదం ఏర్పడినా సీఎం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సీఎం బంధువుల కబ్జాలకు అండగా నిలిచి మైనారిటీ కుటుంబానికి అన్యాయం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపాల్ రెడ్డి ఆక్రమించిన అక్బర్ బాషా భూమిని అప్పగించే బాధ్యత జగన్ రెడ్డి తీసుకోవాలని, బాషా కుటుంబం త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments