Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి సీటు కోసం పవన్ మల్లగుల్లాలు.. బీజేపీ నో.. ఏం జరుగుతుందో?

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (18:23 IST)
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటాలనుకుంటోంది. అయితే జనసేన కూడా తిరుపతి కోసం మల్లగుల్లాలు పడుతోంది. తిరుపతి ఎంపీ సీటును గెలుచుకోవడం కోసం కమలనాథులు వెంకన్న సన్నిధిలో కమలం జెండా ఎగరేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి భారీ వ్యూహాలు సిద్ధం చేసినట్టు తెలిసింది. 
 
లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక అంశాలను బేరీజు వేసుకుని ఓ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు సమాచారం. దీంతోపాటు తిరుపతి ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థిని కూడా దాదాపు ఖాయం చేసినట్టు పార్టీలోని అంతర్గత సమాచారం. గుంటూరు జిల్లా నుంచి గతంలో టీడీపీ నుంచి ఓసారి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత జనసేన పార్టీలో చేరిన ఆ నేత, ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. 
 
ఆ దళిత నేత పేరును బీజేపీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. తిరుపతి లోక్‌సభ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్ కావడంతో అక్కడ కొంచెం పేరున్న దళిత నేతను బరిలోకి దింపాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. 
 
కానీ తిరుపతి ఉప ఎన్నికల టికెట్ తమకే ఇవ్వాలని జనసేన పట్టుబడుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేసి.. కమలానికి జై కొట్టారు. అంతేగాకుండా తిరుపతి సీటు మాకే కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.  
 
తిరుపతి సీటు తమకు ఇవ్వాలని కోరుతున్నందునే పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీలో బీజేపీకి జై కొట్టినట్టు చెబుతున్నారు. అయితే, గతంలో ఓ సారి అక్కడ గెలిచిన తాము మరే పార్టీకి ఇవ్వబోమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో బీజేపీ పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇవ్వనున్నట్టు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరి ఏమౌతుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments