'పల్లె' ఫలితాలు తెచ్చిన జోరు.. ఆ ఎన్నికలకు సై అంటున్న సీఎం జగన్

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (16:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో అధికార వైపాకా మెజార్టీ స్థానాలను దక్కించుకుంది. మొత్తం స్థానాల్లో 80 శాతానికి పైగా దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై చర్చ జరిగింది. 
 
ముఖ్యంగా, గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార వైకాపాకు సానుకూల ఫలితాలు రావడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్‌ మంత్రులకు వివరించారు.
 
ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయాలపై సీఎం మంత్రులను అభినందించారు. పంచాయతీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 80 శాతం ఫలితాలు సాధించామన్నారు. 
 
కోవిడ్ వ్యాక్సినేషన్ త్వరగా ఇవ్వకపోతే మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై  అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
 
అంతకుముందు సీఎం అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌, మంత్రులు కొడాలి నాని, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments