Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. సుఫారీ ఇచ్చి భర్తను దిండుతో ఊపిరాడకుండా చేసి..?

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2023 (08:31 IST)
వివాహేతర సంబంధాలు నేరాలను పెంచేస్తున్నాయి. వివాహేతర సంబంధాన్ని వదులుకోలేకపోయిన ఓ కానిస్టేబుల్ భార్య కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చింది. మద్యం తాగించి నిద్రపోతున్న సమయంలో దిండుతో ముఖాన్ని అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. 
 
అయితే ఆయనది సాధారణ మరణంగా చిత్రీకరించి దొరికిపోయింది. విశాఖ నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బర్రి రమేశ్ కుమార్ (40)-శివజ్యోతి అలియాస్ శివానీ భార్యాభర్తలు. ఎంవీపీ కాలనీలో నివసిస్తున్నారు. 
 
శివానీకి ఎదురింటి రామారావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ సన్నిహితంగా వుంటూ ఒకేసారి రమేశ్ కంటపడ్డారు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో గొడవలు మరింత ముదరడంతో భర్తను హత్యచేసి అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ చేసింది. దీంతో ఒకటిన్నర లక్ష సుఫారీ ఇచ్చి భర్తను ప్రియుడితో కలిసి  హత్య చేయించింది. 
 
ఆపై తన భర్త గుండెపోటుతో మరణించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ప్రవర్తనను అనుమానించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగించారు. విచారణలో జ్యోతి నేరాన్ని అంగీకరించింది. ఆపై ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments