Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు పుట్టలేదని మరో వ్యక్తికి దగ్గరైన భార్య, నడిరోడ్డుపై నరికేశాడు

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (11:22 IST)
తూర్పుగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో దారుణం జరిగింది. తన భార్య వేరొకరితో వుంటోందని ఆగ్రహం చెందిన భర్త ఆమెను నడిరోడ్డుపైనే నరిగి చంపేశాడు.
 
వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి గణపవరం మండలం చిలకంపాడు గ్రామానికి చెందిన చంటియ్యకు అదే మండలం మెయ్యేరు గ్రామానికి చెందిన చంద్రికతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఐతే వారికి సంతానం కలుగలేదు. దీనితో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.ట
 
ఈ క్రమంలో భార్య చంద్రికకు సోషల్ మీడియా ద్వారా జెర్సీ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె తన భర్తను వదిలేసి ఆ యువకుడితో వుండిపోవాలని నిశ్చయించుకుంది. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లి అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది.
 
కానీ భర్తకు ఇది నచ్చలేదు. దీనితో యువకుడు జెర్సీ బైక్ పైన వెళ్తున్న భార్యను రోడ్డుపై అడ్డగించాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం తనతో తెచ్చుకున్న కత్తితో భార్య మెడపై నరికాడు. దాంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. జెర్సీ విషయాన్ని పోలీసులకు తెలపడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో వున్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments