Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య చికెన్ వండిపెట్టలేదని.. ఫ్యానుకు ఉరేసుకున్నాడు..

క్షణికావేశాలను నిగ్రహించుకోలేక ప్రాణాల మీదకు తెచ్చుకునే వారు ఎక్కువవుతున్నారు. అలాగే అదే ఆవేశంలో నేరాలకు పాల్పడే వారి సంఖ్య కూడా పెరుగుతూనే వుంది. తాజాగా ఇంట్లో నాన్‌వెజ్ వండలేదనే చిన్న కారణంతో వ్యక్త

Webdunia
శనివారం, 11 ఆగస్టు 2018 (13:05 IST)
క్షణికావేశాలను నిగ్రహించుకోలేక ప్రాణాల మీదకు తెచ్చుకునే వారు ఎక్కువవుతున్నారు. అలాగే అదే ఆవేశంలో నేరాలకు పాల్పడే వారి సంఖ్య కూడా పెరుగుతూనే వుంది. తాజాగా ఇంట్లో నాన్‌వెజ్ వండలేదనే చిన్న కారణంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. భార్యకు చికెన్ వండిపెట్టమని చెబితే పట్టించుకోలేదని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. యూసుఫ్‌గూడ, జవహర్‌నగర్‌లో సత్యనారాయణ(52), దేవకి దంపతులు ఉంటున్నారు. మద్యానికి బానిసైన సత్యనారాయణ ఇంట్లోనే ఉంటున్నాడు. దేవకి కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తుంది. ప్రతిరోజు పూటుగా మద్యం తాగొచ్చి సత్యనారాయణ తరచూ భార్యతో గొడవ పడేవాడు. 
 
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భార్యతో వాగ్వాదానికి దిగాడు. తనకు చికెన్ చేసి పెట్టాలని భార్యతో చెప్పాడు. అయితే తాను పనికి వెళ్తున్నానని తిరిగి వచ్చిన తర్వాత చేసి పెడతానంది. అంతే సాయంత్రం ఇంటికొచ్చిన దేవికకు భర్తకు షాకే మిగిలింది. చికెన్ వండిపెట్టమని చెప్పిన భర్త.. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments