Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడు గ్రామ వాలంటీర్.. అంతే అతడి సాయంతోనే భర్తను చంపేసింది..

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (21:24 IST)
నెల్లూరు జిల్లా కోవూరులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళా గ్రామ వాలంటీర్ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం ఇద్దరూ కలిసి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి జాతీయ రహదారిపై పడేశారు. ఆపై ఆమె ఏమీ ఎరగనట్లు నటించింది. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు బండారం బయటపడక తప్పలేదు.
 
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కోవూరులో బండికాల రవీంద్ర-సమత అనే దంపతులు చాలాకాలంగా నివసిస్తున్నారు. 14 ఏళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. ఇద్దరు సంతానం. రవీంద్ర అల్లూరు మండలంలోని ఓ చర్చికి పాస్టర్‌గా పనిచేస్తున్నారు. సమత కోవూరులోని శాంతినగర్-2 ప్రాంతంలో గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తోంది.
 
కొంతకాలంగా రాము అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. భర్త ఇంట్లో లేనప్పుడు అతన్ని ఇంటికి పిలిపించుకునేది. ఇదే క్రమంలో ఈ నెల 6వ తేదీ రాత్రి రామును ఇంటికి పిలిపించుకుంది. భర్త ఇంట్లో లేకపోవడంతో అతనితో ఏకాంతంగా గడిపింది. 
 
అయితే భర్త కంట్లో పడింది. ఆగ్రహంతో భార్య సమతను నిలదీశాడు. దీంతో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని సమత, రాము ఆందోళన చెందారు. ఇద్దరు కలిసి రవీంద్ర ముఖంపై గట్టిగా దిండు అదిమిపట్టి.. ఊపిరాడకుండా చేసి అతన్ని హత్య చేశారు. ఆపై జాతీయ రహదారిపై పడేసి వెళ్లిపోయారు. ఆపై ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసుల దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వచ్చాయి.  
 
అలాగే ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందాడని పోస్టుమార్టమ్ రిపోర్టులో తేలింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు సమతను విచారించగా అసలు నిజం బయటపడింది. ప్రియుడు రాముతో కలిసి తానే భర్తను హత్య చేసినట్లు నేరం అంగీకరించింది. దీంతో సమత,రాములపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

తర్వాతి కథనం
Show comments