Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల గుడి మూసేసి ఏం చేయబోతున్నారు? వైసిపి ఎమ్మెల్యే రోజా ప్రశ్న(Video)

టిటిడి ఛైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్‌కు కనీస ఆలోచన లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసిపి ఎమ్మెల్యే రోజా. ఆగష్టు 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతించకూడదంటూ టిటిడి పాలకమండలి నిర్ణయం తీసుకోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ

Webdunia
సోమవారం, 16 జులై 2018 (17:03 IST)
టిటిడి ఛైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్‌కు కనీస ఆలోచన లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసిపి ఎమ్మెల్యే రోజా. ఆగష్టు 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతించకూడదంటూ టిటిడి పాలకమండలి నిర్ణయం తీసుకోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రోజా. గతంలో ఎప్పుడూ లేని విధంగా 9 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించకూడదంటూ నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. 
 
టిటిడి ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇలాంటి నిర్ణయాలు మానుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపై రమణదీక్షితులు చేసిన ఆరోపణలు నిజమనే విధంగా టిటిడి పాలకమండలి వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు రోజా. అసలు గుడి మూసేసి ఏం చేయబోతున్నారు... రమణ దీక్షితులు చెప్పినట్లు ఏమయినా దొంగ పనులు చేయాలని చూస్తున్నారా? సీసీ కెమేరాలు పనిచేయవని ఎందుకు అంటున్నారు.. ఇవన్నీ అనుమానాలను రేకెత్తిస్తున్నాయని వ్యాఖ్యానించారు. వీడియో చూడండి..  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments