Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వై నాట్ పులివెందుల - ఇదే మా నినాదం ' : టీడీపీ నేత బీటెక్ రవి

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (08:38 IST)
తాజాగా వెల్లడైన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయభేరీ మోగించడంతో ఆ పార్టీ నేతల్లో జోష్ వచ్చింది. దీంతో సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులపై కన్నేశారు. "వై నాట్ పులివెందుల" అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు. సీఎం జగన్ "వై నాట్ 175" అంటూ వ్యాఖ్యానిస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నేతలు "వై నాట్ పులివెందుల" అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు. 
 
ఇదే విషయంపై టీడీపీ నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీటెక్ రవి మాట్లాడుతూ, వైకాపా నేత, మాజీ మంత్రి, సీఎం జగన్ సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత క్రూరంగా చంపిన ప్రభావం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించిందన్నారు. సొంత ఇంటి మనిషిని ఇంత క్రూరంగా చంపడం ఏమిటన్నది ప్రజల్లోకి బాగా చొచ్చుకుని వెళ్లిందన్నారు. 
 
ఈ కారణం వల్ల కూడా వైకాపాకి వ్యతిరేకంగా ఓట్లు వచ్చాయని తెలిపారు. మొన్నటివరకు రాష్ట్రంలో 86 శాతం మందినికి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటూ ప్రచారం చేసిన వైకాపా పెద్దలు.. ఎమ్మెల్సీ ఫలితాలతో ఆ లెక్కలు పక్కనబెట్టి వారికి ఎవరికీ తమ పథకాలు అందడం లేదంటూ కారణాలు చెప్పడం మొదలుపెట్టారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments