Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసం - అయ్యప్పదీక్షల ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (09:51 IST)
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. గత 20 రోజుల్లో వీటి ధరలు 22 శాతం మేరకు తగ్గాయి. దీనికి కారణం కార్తీక మాసం, అయ్యప్ప దీక్షలు. ఈ రెండింటి కారణంగా అమ్మకాలు తగ్గిపోయాయి. అంటే డిమాండ్ తగ్గిపోవడం, సరఫరా పెరగడంతో ధరలు తగ్గాయని వ్యాపారులు తెలిపారు. 
 
ఈ కారణంగా గత 20 రోజుల్లో ఏకంగా 22 శాతం మేరకు తగ్గాయి. నవంబరు 3వ తేదీన లైవ్ చికెన్ ధర కిలో రూ.140గా ఉంటే, ఇపుడు అది రూ.126కు పడిపోయింది. స్కిన్, వితౌట్ స్కిన్, బోన్‌లెస్ చెకెన్ ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. చికెన్ ధరల తగ్గుదలపై వ్యాపారులు స్పందిస్తూ, కార్తీక మాసం, అయ్యప్ప దీక్షల కారణంగా డిమాండ్ తగ్గిపోయిందని, అదేసమయంలో చికెన్ సరఫరా పెరిగిందన్నారు. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వివరించారు 
 
కాగా, గత నెల 29వ తేదీన కార్తీక మాసం ప్రారంభమైన విషయం తెల్సిందే. అప్పటి నుంచి అనేక మంది హిందూ ప్రజలు మాంసాహానికి దూరంగా ఉంటున్నారు. దీనికితోడు ఈ నెల 17వ తేదీ నుంచి అయ్యప్ప దీక్షలు ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది అయ్యప్ప దీక్షామాలను ధరించడంతో వారు కూడా మాంసాహానికి దూరంగా ఉంటున్నారు. ఈ కారణాలతోనే చికెన్ ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయని వ్యాపారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments