Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా రమ్మంటారు.. మోదీ వద్దంటారు.. ఏంటిదంతా...? హరిబాబు గుర్రు

కేంద్ర మంత్రివర్గ విస్తరణ బిజెపిలో కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. కొంతమందికి కేంద్రమంత్రి పదవులు ఇస్తామని చెప్పి వారికి మొండిచేయి చూపడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అందులో ఏపీకి చెందిన హరిబాబు, పార్టీపై గుర్రుగా ఉన్నారు. కేంద్రమంత్రి పదవి ఇస్తాం..

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (15:47 IST)
కేంద్ర మంత్రివర్గ విస్తరణ బిజెపిలో కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. కొంతమందికి కేంద్రమంత్రి పదవులు ఇస్తామని చెప్పి వారికి మొండిచేయి చూపడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అందులో ఏపీకి చెందిన హరిబాబు, పార్టీపై గుర్రుగా ఉన్నారు. కేంద్రమంత్రి పదవి ఇస్తాం... కుటుంబ సభ్యులతో కలిసి రమ్మని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి పిలుపు వస్తే ఉన్నఫలంగా బయలుదేరారట హరిబాబు. విజయవాడలో ఒక కార్యక్రమంలో ఉన్న హరిబాబు కుటుంబ సభ్యులందరినీ వెంట పెట్టుకుని ఎంతో సంతోషంగా వెళ్ళారు.
 
చివరకు హరిబాబుకు మంత్రి పదవి ఇవ్వలేదు కదా.. కనీసం పట్టించుకోనూ లేదు. దీంతో ఆగ్రహంతో వూగిపోయిన హరిబాబు తన అనుచరుల వద్ద బాధను వెళ్ళగక్కాడట. అమిత్ షా రమ్మంటారు.. మోదీ వద్దంటారు.. ఏంటిదంతా.. నిర్ణయం ఎంతమంది తీసుకుంటారు. ఇది అన్యాయం. ఎన్నో యేళ్ళు పార్టీలో కష్టపడి పనిచేశాను. ఇదా నాకు దక్కే ఫలితం. తగిన శాస్తి జరిగింది. ఇక అవసరం లేదు. పార్టీలో కొనసాగలేను. పార్టీ నుంచి బయటకు వచ్చేస్తా. 
 
నాకు ఏ పదవులు అవసరం లేదంటూ తన సన్నిహితులతో బాధను వెళ్ళగక్కారట. ఎంపిగా కొనాసాగుతున్న హరిబాబుకు బిజెపి అగ్ర నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ సన్నిహిత సంబంధాలే చివరకు మంచి అవకాశాన్ని వచ్చే విధంగా చేస్తుందనుకున్నారు. కానీ అది నోటి వరకు వచ్చి జారిపోవడంతో హరిబాబు ఓర్చుకోలేకపోతున్నారట. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది సీనియర్ బిజెపి నేతలు హరిబాబును బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments