ఎపి సిఎం జగన్ చేతిలో చంటిబిడ్డ, ఎవరు?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (22:44 IST)
కడప జిల్లా ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి కార్యక్రమానికి హాజరయ్యారు. తండ్రికి ఘన నివాళులు అర్పించారు సిఎం కుటుంబ సభ్యులు. జయంతి అయినా వర్థంతి అయినా ఇడుపులపాయకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో పులివెందులకు చెందిన జ్యోతి అనే వైసిపి కార్యకర్త తన చేతిలోని చంటి బిడ్డను జగన్‌కు ఇచ్చారు. ఆ బిడ్డను చూసిన జగన్మోహన్ రెడ్డి కాసేపు మురిసిపోయారు. ఎంతో ముద్దుగా ఉండటంతో పేరు అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన సతమణి భారతి కూడా బిడ్డను ఆశీర్వదించారు. మీ ఆశీస్సులు నా బిడ్డకు శ్రీరామరక్ష అంటూ తల్లి జ్యోతి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
 
చంటిబిడ్డ సిఎం చేతిలో ఉండటాన్ని ఆసక్తిగా తిలకించారు వైసిపి కార్యకర్తలు, నాయకులు. గతంలో చిన్నపిల్లలను ఆప్యాయంగా ముద్దు పెట్టుకునే జగన్ ఈ సారి బిడ్డను చేతికి ఎత్తుకుని ఆశీర్వదిండంతో అందరూ ఆశ్చర్యంగా తిలకించారు. ముఖ్యమంత్రి అయినా కూడా జగన్ సాధారణంగానే ఉన్నారంటూ ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments