Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ వద్ద వుండగా జనసేన బాగుపడదు... అందుకే భాజపాలో చేరా... ఎవరు?

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (17:08 IST)
భారతీయ జనతా పార్టీ వీలు చిక్కినప్పుడల్లా అటు తెలుగుదేశం పార్టీకి ఇటు జనసేన పార్టీకి షాకులిస్తోంది. ఆ పార్టీలకు చెందిన నాయకులను మెల్లిగా పార్టీలో చేర్చుకుంటోంది. అలా క్రమంగా ఏపీలో బలం పుంజుకోవాలన్నది భాజపా ప్లాన్. ఇక ఈ ప్లానులో భాగంగా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం ఆహ్వానం అందించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై పవన్ కూడా నర్మగర్భంగా స్పందించారు. తన నెత్తిపై కత్తి పెట్టి పార్టీని కలపమన్నా ఆ పని చేసేది లేదని తేల్చి చెప్పారు. 
 
తాజా పవన్ కామెంట్లతో ఇక జనసేన అధినేత ఇటువైపు చూసేది లేదని భాజపా అనుకున్నదో ఏమోగానీ, జనసేనకు చెందిన నాయకులను మెల్లమెల్లగా ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసిన పి. లక్ష్మీసామ్రాజ్యంకి కమలం తీర్థం ఇచ్చేసింది. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తనకు గత ఎన్నికల్లో 7 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయనీ, ఐతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర అంజిబాబు వంటి వ్యక్తులు వుండగా ఇక ఆ పార్టీ బాగుపడదనిపించి భాజపాలో చేరినట్లు వెల్లడించారు. ఎందుకంటే... జనసేనకు ఓట్లు వేసినవారిని వదిలేసి వైసిపికి ఓట్లు వేసిన వారిని పవన్ వద్దకు తీసుకుని వెళ్లి వారు పార్టీ కోసం శ్రమించారని చెప్పడమూ, వారికి సముచిత గౌరవం లభించడం.. తదితరాలన్నీ చూశాక, ఇక జనసేనలో న్యాయం లభించదన్న నిర్ణయానికి వచ్చి ఈ పని చేసినట్లు సామ్రాజ్యం తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments