Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుపరిపాలన అందిస్తున్న రాష్ట్రాల పట్టికలో ఆంధ్రప్రదేశ్‌ది ఎన్నో స్థానం?

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (19:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో తమ స్థానాన్ని పదిలపరుచుకుంది. ప్రజలకు ఉత్తమ పాలన అందిస్తున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడో స్థానం దక్కింది. పబ్లిక్ అఫైర్స్ సెంటర్ (పీఏసీ) ఈ మేరకు పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్-2020 జాబితా విడుదల చేసింది.
 
ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 0.531 పాయింట్లు లభించాయి. ఇక సుపరిపాలన అందిస్తున్న రాష్ట్రాలలో కేరళ అగ్రస్థానంలో ఉండగా తమిళనాడు తర్వాత స్థానంలో నిలిచింది. సమానత్వం, స్థిరత్వం, అభివృద్ది ప్రాతిపదికన ఈ ఎంపిక జరిగింది. ఈ జాబితాను రెండు కేటగిరీగా విభజించి అందులో అధిక జనాభా గల పెద్ద రాష్ట్రాలను ఒక జాబితాలో చేర్చారు.
 
అదేవిధంగా చిన్న రాష్ట్రాలను మరో జాబితాలో చేర్చారు. పెద్ద రాష్ట్రాల జాబితాలో కేరళ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక టాప్ 4లో నిలిచాయి. యూపీ, బీహార్, ఒడిస్సా అడుగునపడ్డాయి. చిన్న రాష్ట్రాలలో గోవా అగ్ర స్థానంలో నిలిచింది. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఈ జాబితా విడుదల చేశారు. అందులో చండీగడ్ అగ్ర స్థానంలో నిలిచింది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments