Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్తే మద్యం మత్తులో యువతిపై రేప్

Webdunia
గురువారం, 13 మే 2021 (11:49 IST)
స్నేహితుడితో కలిసి సముద్ర తీరానికి వెళ్లిన ఓ యువతిపై మద్యం మత్తులో ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (21) 15 రోజుల కిందట అల్లవరంలోని తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చింది. ఆ సందర్భంగా స్నేహితుడితో కలిసి కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో సముద్ర తీరానికి వెళ్లింది.
 
కాగా, మద్యం తాగి అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న సీతారామపురానికి చెందిన ఇద్దరు యువకులు, సత్యనారాయణ పురానికి చెందిన మరో వ్యక్తి వారి వద్దకు వచ్చారు. స్నేహితుడిని బంధించారు. అతడి ముందే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత నగ్నంగా ఉండగా యువతి ఫొటోలు తీశారు. పది రోజుల తర్వాత వారిలో ఓ వ్యక్తి మళ్లీ తన కోరిక తీర్చాలని, లేదంటే నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు.
 
దాంతో బాధితురాలు బంధువులకు చెప్పడంతో వారు బుధవారం (మే 12,2021) అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఆడపిల్లల తల్లిదండ్రులను ఉలిక్కిపడేలా చేసింది. వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన దురాఘాతానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments