Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొర్రెల‌ను వాగు దాటించి, ప్రాణాలు కాపాడిన ఎస్ఐ రమేష్

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (13:09 IST)
మ‌నుషుల‌కే కాదు, మూగ జీవాల‌కు కూడా పోలీసులే ర‌క్ష‌ణ అని నిరూపించారు...ఎస్.ఐ. ర‌మేష్. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో కురిసిన కుండపోత వానతో వాగులు పొంగి పొరలడంతో ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది. వసంతవాడ గ్రామం నుండి రుద్రకోట వెళ్లే దారిలో పెద్ద వంతెన వద్ద ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహించడంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 
 
పెద్ద వంతెన దాటలేక రెండు వేల గొర్రెలు కొట్టుకుపోతూ ఉండగా, ఆ సమాచారాన్ని తెలుసుకున్న వేలేరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ పరిమి రమేష్ హుటాహుటిన అక్క‌డికి చేరారు. త‌న సిబ్బందితో ఆ ప్రదేశానికి చేరుకుని, గ్రామస్థుల సహకారంతో వాగులో దిగి,  గొర్రెలు కొట్టుకుపోకుండా సురక్షిత ప్రాంతానికి  తరలించారు. ప్రజల రక్షణ ఏ కాకుండా జంతువుల ప్రాణాల పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాల‌ని సిబ్బందికి సూచించారు. ప్ర‌మాదకర స్థలానికి వచ్చి, మూగ జీవాల ప్రాణాలు కాపాడిన వేలేరుపాడు ఎస్ ఐ పరిమి రమేష్ ను, ఇత‌ర పోలీసు సిబ్బందిని ప్రజలు, గొర్రెల యజమానులు కొనియాడారు. వారికి కృతజ్ఞతలు తెలియపరిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments