Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి వచ్చిన అతిథులతో రక్తదానం చేయించిన కొత్త జంట

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (11:44 IST)
పెళ్లికి వచ్చిన అతిథులతో కొత్త జంట రక్తదానం చేయించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జరిగింది. ఇంతకీ అసలు ఎందుకీ రక్తదానం చేసారు?
 
పిఠాపురానికి చెందిన నీలం దయాసాగర్‌ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. దయాసాగర్ వివాహం అదే పట్టణానికి చెందిన పద్మసాయి కృష్ణవేణితో ఆదివారం రాత్రి 10.35 గంటలకు జరిగింది. ఐతే ఈ పెళ్లికి వచ్చినవారు తమను ఆశీర్వదించడంతో పాటు రక్తదానం కూడా చేయాలని వరుడు దయాసాగర్ కోరాడు.
 
దయాసాగర్ విన్నపాన్ని మన్నించిన బంధుమిత్రులు నవ దంపతులను ఆశీర్వదించి ఆ తర్వాత రక్తదానం ఇచ్చారు. తన అభ్యర్థన మేరకు రక్తదానం చేసిన 35 మంది బంధుమిత్రులకు అభినందన తెలియజేసింది కొత్త జంట. కాగా రక్తదానం చేయించిన వరుడు దయాసాగర్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments