Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి వచ్చిన అతిథులతో రక్తదానం చేయించిన కొత్త జంట

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (11:44 IST)
పెళ్లికి వచ్చిన అతిథులతో కొత్త జంట రక్తదానం చేయించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జరిగింది. ఇంతకీ అసలు ఎందుకీ రక్తదానం చేసారు?
 
పిఠాపురానికి చెందిన నీలం దయాసాగర్‌ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. దయాసాగర్ వివాహం అదే పట్టణానికి చెందిన పద్మసాయి కృష్ణవేణితో ఆదివారం రాత్రి 10.35 గంటలకు జరిగింది. ఐతే ఈ పెళ్లికి వచ్చినవారు తమను ఆశీర్వదించడంతో పాటు రక్తదానం కూడా చేయాలని వరుడు దయాసాగర్ కోరాడు.
 
దయాసాగర్ విన్నపాన్ని మన్నించిన బంధుమిత్రులు నవ దంపతులను ఆశీర్వదించి ఆ తర్వాత రక్తదానం ఇచ్చారు. తన అభ్యర్థన మేరకు రక్తదానం చేసిన 35 మంది బంధుమిత్రులకు అభినందన తెలియజేసింది కొత్త జంట. కాగా రక్తదానం చేయించిన వరుడు దయాసాగర్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments