27న బంగాళాఖాతంలో వాయుగుండం

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (17:51 IST)
బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు నెలకొనివున్నాయని భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రం వెల్లడించింది. ఈ నెల 27వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకునివుని అల్ప పీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఈ నెల 29వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. ఇది తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్టు ప్రైవేటు వాతావరణ సంస్థలు వెల్లడించాయి. 
 
ప్రస్తుతానికి దక్షిణ అండమాన సముద్రం పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఐఎండీ వివరించింది. అటు గడిచిన 24 గంటసల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. తమిళనాడులోని మేట్టుపాళెయంలో అత్యధికంగా 37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

స్టేడియంకు పాపులు వెళ్లడం వల్లే భారత్ ఓడిపోయింది : మమతా బెనర్జీ  
 
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టు లీగ్ దశ నుంచి సెమీ ఫైనల్ మ్యాచ్ వరకు అన్ని మ్యాచ్‌లు గెలుచుకుంటూ వచ్చారని, ఫైనల్ మ్యాచ్‌కు మాత్రం స్టేడియానికి పాపులు వెళ్ళి టీమిండియాను ఓడించారని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఆటగాళ్ళు వేసుకునే జెర్సీలను కూడా కాషాయం రంగులో తయారు చేశారంటూ ఆమె మండిపడ్డారు. 
 
ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ను మోడీ స్టేడియంలో కాకుండా, లక్నోలో పెట్టివుంటే భారత్ గెలిచివుండేదని, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఇదే అంశంపై వెస్ట్ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు.
 
ప్రపంచ కప్ ప్రతి మ్యాచ్‌లో భారత్ గెలిచింది. కానీ ఫైనల్స్‌కు పాపులు వచ్చారని, ఫైనల్స్‌ ఓడిపోవడానికి ఆ పాపులు మ్యాచ్‌కు రావడమే కారణమని మమత విమర్శించారు. అహ్మదాబాద్‌లో కాకుండా ముంబైలోని వాంఖడే స్టేడియంలోగానీ, కోల్‌‍కతా ఈడెన్ గార్డెన్స్‌లోగానీ ఫైనల్ మ్యాచ్ నిర్వహించివుంటే భారత్ ఖచ్చితంగా విశ్వవిజేతగా నిలిచేదిని వెల్లడించారు. దేశాన్ని కాషాయమయం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని మమత విమర్శించారు. భారత్ ప్రాక్టీస్ చేసే సమయంలో ధరించే జెర్సీలను కూడా కాషాయ రంగులో తయారు చేశారని, తద్వారా జట్టును కూడా కాషాయికరించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments