Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీలో త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడతాం: మంత్రి పేర్ని నాని

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (09:31 IST)
ఆర్టీసీలో పని చేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇప్పటికే ఆర్టీసీ అంగీకరించిందని, వారి పట్ల పూర్తి సానుభూతితో ప్రభుత్వం ఉందని  త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడతామని, రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. 

ఆయన మచిలీపట్నంలోని తన కార్యాలయం వద్దకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓపిగ్గా విని పలు పరిష్కారాలు వారికి చూపించారు. తొలుత  రాష్ట్రంలోని అనంతపూర్, కర్నూల్,  తూర్పు గోదావరి,  కర్నూల్, కడప, గుంటూరు జిల్లాలకు చెందిన ఆర్టీసీ కారుణ్య నియామక అభ్యర్థులు మంత్రిని కలిసి తమ కష్టాలను ఏకరువు పెట్టారు.

తమ తండ్రులు, భర్తలు ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో అకాల మృత్యువు పాలయ్యారని, గత కొంతకాలంగా కారుణ్య నియామకాలు లేకపోవటంతో తాము ఎంతో ఇబ్బందులకు గురవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. తనకు కారుణ్య నియామకాల పట్ల పూర్తి చిత్తశుద్ధి ఉందని, మీపట్ల ఎంతో సానుభూతితో ఉన్నానని, తప్పక మీకు సహాయపడతానని వారికి తెలిపారు.

వచ్చిన వారందరికీ అల్పాహారం ఏర్పాటుచేసి తిరుగు ప్రయాణం ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి  500 రూపాయల చొప్పున నగదు అందచేయాలని తన వ్యక్తిగత కార్యదర్శి తేజకు మంత్రి పేర్ని నాని ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments