Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల తరువాత పునరాలోచిస్తాం.. పాఠశాలల నిర్వహణపై ఏపీ విద్యామంత్రి

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (12:58 IST)
ఒక నెల రోజుల పాటు ఒక పూట మాత్రమే పాఠశాలలను నిర్వహిస్తామని, తరువాత పరిస్థితి దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. 
 
కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, ఇది వరకే విద్యార్థులకు బ్యాగులు, యూనిఫారాలు, పుస్తకాలన్నింటినీ సరఫరా చేశామన్నారు. కడప కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మాట్లాడారు. 
 
పారదర్శకంగా, నిజాయితీ, జవాబుదారీ తనంతో పని చేయాలనే.. జగన్మోహన్‌రెడ్డి ఆశయాలను అమలు చేయాలన్నారు. కడప జిల్లాలో 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 805 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. 
 
జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే వర్షాలు కూడా పుష్కలంగా కురిశాయని చెప్పారు. 13 రిజర్వాయర్లలో 75 శాతం మేరకు నీటిని నిల్వ ఉంచామన్నారు. 
 
కరోనా విస్తరిస్తున్న దృష్ట్యా సంక్షేమ పథకాలకు ఏమాత్రం ఢోకా లేకుండా అన్నింటినీ అమలు పరిచామన్నారు. నవరత్నాల్లో లేని పథకాలను కూడా ప్రజలకు అందజేశామన్నారు. 
 
ప్రభుత్వ చీప్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ తెదేపా చేసిన తప్పిదాలను వైకాపా సరిచేస్తోందన్నారు. పోలవరానికి ఈ దుస్థితి వచ్చిందంటే తెదేపానే కారణమన్నారు.

గీతం విశ్వవిద్యాయలం గురించి తెదేపా లేని రాద్ధాంతం చేస్తోందన్నారు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరని శ్రీకాంత్​రెడ్డి ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments