Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల వాయిదా పై నిమ్మగడ్డ మమ్మల్ని సంప్రదించలేదు: హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్

election
Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (19:57 IST)
ఎపి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటిషన్ పై హైకోర్టులో ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేశారు.

నిమ్మగడ్డను తొలగించేందుకే ఆర్డినెన్స్ తెచ్చారనడాన్ని ఖండిస్తున్నట్టు ద్వివేది తమ కౌంటర్ పిటిషన్  లో తెలిపారు. ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేందుకే ఆర్డినెన్స్ ను తీసుకువచ్చామని వివరించారు.

ఈ వ్యవహారంలో రమేశ్ కుమార్ చేసిన ఆరోపణలేవీ నిజం కావని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని నిర్ణయించే అధికారం గవర్నర్ కు ఉందని, గవర్నర్ ఆమోదించాకే ఆర్డినెన్స్ ను తీసుకువచ్చామని తెలిపారు.

గవర్నర్ ఆమోదించాక ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదని ద్వివేది హితవు పలికారు. కాగా, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీ హోదాలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ తమను సంప్రదించలేదని ప్రభుత్వం కౌంటర్ లో పేర్కొంది.

అటు, కరోనా విషయంలోనూ ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ సంప్రదించలేదని ద్వివేది వివరించారు. ఎన్నికలు వాయిదా పడినా కోడ్ కొనసాగుతుందని నిమ్మగడ్డ ప్రకటించడం సరికాదని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments