Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనకు మరో అణు క్షిపణి

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (06:10 IST)
భారత అమ్ములపొదిలో మరో అణు క్షిపణి చేరింది. రెండు వరుస వైఫల్యాల తరువాత ఎట్టకేలకు కే4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. విశాఖపట్నం నుంచి 30 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఈ క్షిపణి ఛేదించింది.

ఆదివారం నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతమైందని, అణు జలాంతర్గామి నుంచి 3500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదని డీఆర్డీవో తెలిపింది. ఈ బాలిస్టిక్ క్షిపణిని ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌లో అమర్చేలా అభివృద్ధి చేశామని, 17 టన్నుల బరువుండే ఈ క్షిపణి రెండు టన్నుల వార్‌హెడ్‌ను మోసుకుపోగలదని డీఆర్డీవో తెలిపింది.

ఇదిలా ఉంటే 2019 నవంబర్‌లోనే ఈ క్షిపణి ప్రయోగం జరగాల్సిఉంది. కానీ అప్పట్లో బంగాళాఖాతంలో బుల్‌బుల్‌ తుపాన్‌ తీవ్రంగా ఉండడంతో ప్రయోగం వాయిదా పడింది. అయితే ఆదివారం నిర్వహించిన ప్రయోగం విజయవంతం కావడంతో సముద్రతలం నుంచి అణు క్షిపణులను ప్రయోగించగల ఆరో దేశంగా భారత్ అవతరించింది.

ఈ క్షిపణిని అణు జలాంతర్గాముల్లో అమర్చి సైన్యం చేతికి అందించేలోపు మరికొన్నిసార్లు ప్రయోగాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు డీఆర్డీవో తెలిపింది. డీఆర్డీవో అధికారులకు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments