Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా సిద్ధం : సజ్జల రామకృష్ణారెడ్డి

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (08:51 IST)
దేశంలో ఏ క్షణంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైకాపా సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లాలో రూ.14 కోట్లతో అభివృద్ధి చేసిన జగ్గయ్యపేట - చిల్లకల్లు రోడ్డును బుధవారం ప్రారంభించిన ఆయన పలు కార్యక్రమాల అనంతరం ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జగ్గయ్యపేట మున్సిపల్‌ కూడలిలో జరిగిన సభలో ప్రసంగించారు. 
 
ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో చేసిన అభివృద్ధితో పోలిస్తే ఏ రాష్ట్రంలో కూడా కనీసం 10 శాతం చేయలేదన్నారు. వైకాపా ప్రభుత్వంపై చేసేందుకు విమర్శలు లేక తెదేపా అధినేత చంద్రబాబు అనేక కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన పుత్రుడు లోకేశ్‌, దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్‌, ఎల్లో మీడియాను ఆసరాగా చేసుకొని టీడీపీని బతికించుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. 
 
టీడీపీ కుయుక్తులకు మోసపోకుండా జనం, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సజ్జలతోపాటు నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, తితిదే పాలకవర్గ సభ్యుడు సుబ్బారావు, వైకాపా వైద్య విభాగం అధ్యక్షుడు మహబూబ్‌, పార్టీ ఇన్‌ఛార్జి రఘునాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments